తిప్ప తీగ 



తిప్పతీగ ఇచ్చే ఆరోగ్యప్రయోజనాలు అద్భుతమైనవి అనడంలో అతిశయోక్తి లేదు. మెరుగైన 

రోగనిరోధక శక్తి కోసం ఆయుర్వేదం అందించే మరో సూపర్‌ఫుడ్ ఇది. ఆయుర్వేదంలో 

'అమృతం'గా ప్రసిద్ది చెందింది. పురాతన కాలం నుండి భారతీయ వైద్యంలో ఉపయోగంలో ఉన్న 

తిప్పతీగ మొక్కలో పుష్కలంగా ఔషధ గుణాలు ఉన్నాయి. తిప్పతీగ కాండం సహా ఆకు వరకు 

అనేక అనారోగ్య సమస్యలను పరిష్కరిస్తుంది.

1. తిప్ప తీగతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది:

హృదయం ఆకారంలో ఉండే ఈ మూలిక సహజంగా యాంటీ ఆక్సిడెంట్స్‌తో నిండి ఉంటుంది. 

ఇది ఫ్రీ రాడికల్స్, వ్యాధిని కలిగించే క్రిములతో పోరాడటానికి సహాయపడుతుంది. ఇది 

టాక్సిన్స్‌ను తొలగించడంలో, రక్తాన్ని శుద్ధి చేయడంలో, కాలేయ వ్యాధిని ఎదుర్కోవడంలో, 

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌లను ఎదుర్కోవడంలో మన శరీరానికి సహాయపడుతుంది.

యాంటీ-పైరేటిక్ స్వభావం కలిగి ఉండటం వలన ఇది దీర్ఘకాలిక జ్వరాలతో పోరాడటానికి కూడా 

సహాయపడుతుంది. డెంగ్యూ ఉన్నప్పుడు కూడా సిఫారసు చేస్తారు. తిప్పతీగ మన రోగనిరోధక 

శక్తిని బలోపేతం చేస్తుంది

2. డయాబెటిస్ నివారణకు తిప్పతీగ

మీ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను మెరుగుపరచడం ద్వారా డయాబెటిస్‌ను అదుపు చేయడంలో 

తిప్పతీగ మీకు సహాయపడుతుంది. వివిధ రకాల ఫైటోకెమికల్స్ శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని 

తగ్గించడం, సహజ ఇన్సులిన్ స్రావాన్ని పెంచడానికి పని చేస్తాయి. జర్నల్ ఏన్షియంట్ సైన్స్ 

ఆఫ్ లైఫ్‌లో ప్రచురించిన 2010 పరిశోధనా పత్రం కూడా తిప్పతీగ లేదా టినోస్పోరా కాలేయంలో 

మధుమేహం-ప్రేరిత ఆక్సీకరణ ఒత్తిడిని గణనీయంగా ఎదుర్కొంటుందని పేర్కొంది.

3. శ్వాస సంబంధిత సమస్యలతో పోరాడే తిప్పతీగ
 
తిప్ప తీగలో కనిపించే అద్భుతమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ శక్తులు తరచుగా దగ్గు, జలుబు, 

టాన్సిలిటిస్ వంటి ఏవైనా సాధారణ శ్వాసకోశ సమస్యలతో పోరాడటానికి సహాయపడతాయి. 

జలుబు, దగ్గు మాత్రమే కాకుండా, ఇది ఉబ్బసం రోగులకు కూడా ఉపశమనం కలిగిస్తుంది. ఛాతీ 

బిగుతుగా ఉండడం, శ్వాస ఆడకపోవడం, దగ్గు, గురక వంటి లక్షణాలను తిప్పతీగ తగ్గిస్తుంది.

4. ఒత్తిడి, ఆందోళనను తగ్గించే తిప్పతీగ

తిప్పతీగను అడాప్టోజెనిక్ హెర్బ్‌గా ఉపయోగించవచ్చు. అడాప్టోజెన్ అనేది ప్రాథమికంగా మన 

శరీరం ఒత్తిడికి అనుగుణంగా సహాయపడే పదార్ధం. ఈ ఆరోగ్య టానిక్ మన శరీరం నుంచి టాక్సిన్స్ 

బయటపడటానికి, మన జ్ఞాపకశక్తిని పెంచడానికి సహాయపడుతుంది. అందువల్ల ఇది మనల్ని 

ప్రశాంతంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది.

5. గుండె జబ్బుల నుంచి రక్షణకు తిప్పతీగ

డయాబెటిక్ ఎలుకలలో తిప్పతీగ ప్రభావాలను జర్నల్ ఆఫ్ ఎత్నోఫార్మకాలజీలో ప్రచురించిన 

ఒక పరిశోధనా పత్రం అధ్యయనం చేసింది. ఇది డయాబెటిక్ ఎలుకలలో సీరం కొలెస్ట్రాల్ 

స్థాయిలను గణనీయంగా తగ్గించిందని కనుగొన్నారు. తిప్పతీగ లిపిడ్ జీవక్రియను సక్రమంగా 

ఉండేలా చేస్తుంది. తద్వారా మీ గుండెకు పరోక్షంగా ప్రయోజనం చేకూరుస్తుందని మరొక 

అధ్యయనం కనుగొంది.

6. మహిళల్లో బోలు ఎముకల వ్యాధిని నివారించే తిప్పతీగ

తిప్పతీగ కాండం మహిళల్లో బోలు ఎముకల వ్యాధిని ప్రభావితం చేస్తుందని యూరోపియన్ 

మెనోపాజ్, ఆండ్రోపాజ్ సొసైటీ యొక్క అధికారిక జర్నల్ అయిన మాట్యురిటాస్‌లో 

ప్రచురితమైన ఒక అధ్యయనం తెలిపింది. తద్వారా బోలు ఎముకల వ్యాధి నివారణలో

ఉపయోగపడుతుందని తేల్చింది.

అందరూ ఇంటిలో మనీ ప్లాంట్ పెంచుకుంటారు కానీ తిప్పతీగ పెంచుకోండి అన్ని రకాలుగా 

మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.


తిప్పతీగ, ఆకు వేరు చాలా విలువ కలిగినవి. 

అప్పుడప్పుడు తిప్పతీగ ఆకుని డైరెక్ట్ గానమిలి మింగవచ్చు, లేదా ఆకుల్ని మిక్సీలో వేసి ముద్దగా 

చేసి ఉండలుగా చేసి ఆరబెట్టుకొని గోలీలుగా చేసుకొని మింగొచ్చు. సహజంగా ఇమ్యూనిటీకోసం 

రోజుకు ఒక ఆకు సరిపోతుంది. 
 


తిప్పతీగ చాలా వేడి చేస్తుంది. మంచిదని అధిక మోతాదులో పొరపాటున కూడా తీసుకోకూడదు. 

రెండు మూడు తిప్పతీగ ఆకుల్ని వేసి రెండు గ్లాసు నీళ్లు పోసి ఒక గ్లాసు అయ్యేలా మరిగించి 

అందులో కాసింత మిర్యాల పొడి కలుపుకొని తీసుకున్నట్లయితే ఇమ్యూనిటీకి చాలా బాగా 

పనిచేస్తుంది వారానికి మూడుసార్లు తీసుకోవచ్చు.

డయాబెటిస్ ఉన్నవాళ్లు ఇంతకుముందు చెప్పినట్లు గోలీలుగా చేసుకొని ఆరబెట్టి నిల్వ 

ఉంచుకోవచ్చు.రోజుకి మూడు గోలీల చొప్పున ఉదయం పరగడుపున తీసుకోవచ్చు. 

గోలి సైజు చిన్న కుంకుడు గింజంత పరిమాణంలో ఉంటే సరిపోతుంది. 

తిప్పతీగ ఆకు కంటే దాని వేరులోనూ, తీగలోను, ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.

ప్రమాదం గా మారిన అమ్మలు - అమ్మాయిల ఆరోగ్యం 
ఆడవారి  ఆహార నియమలపై మిల్లెట్ రాంబాబు గారి సూచనలు 

 

 

అరటి పండులో సహజ సిద్దమైన చక్కెరలు, పీచు పదార్ధాలు సమృద్దిగా వుంటాయి. గంటన్నర

శ్రమకు తగిన శక్తి రెందు అరటి పళ్ళు అందిస్తాయి. మనం టివిలో తరచూ చూస్తుంటాము

ప్రపంచ టెన్నిస్ ఆగటగాలళ్ళు ఆటమద్య విరామ సమయములో రెందు పళ్ళు తినటం

శక్తినివ్వటమే కాదు, అనేక రోగాలను నిరోదించే గుణం కలది. ముఖ్యంగా తీవ్రమైన ఒత్తిడికి లోనైన

వారు ఈఫలం తీసుకుంటె ఒత్తిడి తగ్గి మనస్సు ప్రసాంతంగా ఉంటుంది. ఇందులో వుండే బి6

విటమిన్ రక్తంలోని చక్కర మోతాదుని నియంత్రిస్తుంది. దీనిలో ఇనుప ధాతువులు రక్తంలోని 

ఎర్రకణాలను వృద్ది చేస్తాయి. దీనిలో వుండే అధికశాతం పొటాషియం వలన రక్తపుపోటుని 

అదుపులో వుంచి పక్షవాతం రాకుండా ఆపుంది. దీనిలోని అధిక పీచు పదార్ధం వలన 

మలబద్దకాన్ని నివారిస్తుంది. దీనిని ప్రతిరోజూ ఏదో ఒకసమయంలో భుజించుట వలన మెదడుకి 

చురుకుదనం పెరుగుతుంది.


ముఖ్యంగా విద్యార్థులలో గ్రహణ శక్తిని పెంపోందిస్తుంది. చాతిలో మంటను తగ్గిస్తుంది. 

వేవిళ్ళలతో బాధపడె మహిళలు వీటిని తింటే చాలా ఉపశమనం కలుగుతుంది.

దోమకాటు వలన వచ్చే వాపు, మంటకు పరటి పండు తొక్కలోపలి భాగంతో రుద్దితే తక్షణం 

ఉపశమనం కలుతుంది.దీనిలో ఉండే బి విటమిన్ నాడీమండలానికి మేలు చేస్తుంది. చిప్సు, 

చాక్లెట్లు తినడం మాని అరటిపండ్లను తినడం వల్ల మానిసిక ఒత్తిడిని తగ్గించటమే కాకుండా 

ఊబకాయాన్ని నివారిస్తుంది. కడుపులో పుండ్లను (Ulcers) నివారించుటలో మేటిఫలం. మానసిక 

ప్రశాంతత కలిగించుటలో ఈ పండును మొదట చెప్పుకోవాలి._


ధాయ్ లాండ్ దేశంలో గర్బిణి స్త్రీలు విధిగా వీటిని తినటం ద్వారా పుట్టబోయే పిల్లలు సాత్విక 

స్వభావులుగా వుంటారని నమ్ముతారు.


ఋతువుల మార్పువలన వచ్చే అనేక సమస్యలకు విరుగుడు ఈఫలమే! పొగ తాగే అలవాటుని 

మానిపించుటలో అరటి పండును గురించి ఆలోచించాలి. 


ఒత్తిడి తగ్గించేందుకు భోజన విరామ సమయంలో చిరు తిండిగా తీసుకుంటే ప్రయోజనం 

ఉంటుంది. క్రమం తప్పకుండా ఈ పండును తినే వారికి పక్షవాతం లాంటి వ్యాధులు వచ్చే 

అవకాశం లేదు. ఉలిపిరి కాయలను నిర్మూలించాలంటే అరటి పండు తొక్క లోపలి భాగం

ఉలిపిర్ల మీద పెట్టి కదలకుండా ప్లాస్టరుని అతికించినచో క్రమంగా తగ్గుతాయి. 

ఆపిల్ తో పోలిస్తే నాలుగురెట్లు మాంసకృత్తులు, రెట్టింపు పిండి పదార్ధాలు, మూడురెట్లు భాస్వరం, 

ఐదురెట్లు విటమిన్ -ఎ కలిగివుంది.

*మీ కాలి బూటు మెరుపు తగ్గిందా.. అరటి పండు తొక్క లోపలి భాగంతో రుద్దండి ఆ తరువాత పాలిష్ చేయండి, మెరిసి పోతూ ఉంటుంది.

30 రకాల కూరగాయలు – ఒక్కోదాని వల్ల ఒక్కో ఉపయోగం – ఇది తెలుసుకుంటే చాలు


అల్లం:  అల్లం తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి.

కరివేపాకు: కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది.

నేరేడు పండ్లు:  నేరేడు పండ్ల గింజల్లో ఉండే జంబోలిన్ అనే గ్లూకోసైట్, మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.

గుమ్మడికాయ: గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది.

అవకాడో ఫలాలు: అవకాడో ఫలాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి తరచుగా తింటే మలబద్దకం పోతుంది.

జామపళ్ళు: జామపళ్ళు హార్మోన్ల హెచ్చుతగ్గులను నివారిస్తాయి.

బ్లాక్ టీ: బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది.

సజ్జలు: సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే, పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది.

మామిడి పండ్లు: మామిడిపండుకి మూత్రపిండాల్లోని రాళ్ళను కరిగించే శక్తి ఉంది.

బీట్ రూట్: బీట్ రూట్.. బీపీని క్రమబద్దీకరిస్తుంది.

మునగాకు: మునగాకు తింటే గ్యాస్ట్రిక్ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.

దానిమ్మ: దానిమ్మరసం కామెర్లకు మంచి మందుగా పనిచేస్తుంది.

ఆవాలు: ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ధి చెందుతుంది.

అల్లం: అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది, మలబద్దకాన్ని కూడా వదిలిస్తుంది.

కీరదోస: కీరదోసలో ఉండే సిలికాన్, సల్ఫర్ లు శిరోజాలకు మేలు చేస్తాయి.

మునగాకు: మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్ ని దరికి చేరనివ్వదు.

ద్రాక్ష: ద్రాక్షలో అధికపాళ్ళలో ఉండే బోరాన్.. ఆస్టియో పొరాసిస్ రాకుండా కాపాడుతుంది.

బీట్ రూట్: బీట్ రూట్ రసం ‘లో బీపీ ‘ సమస్య నుంచి గట్టేక్కిస్తుంది.

క్యారెట్: క్యారెట్ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.

మొక్కజొన్న: మూత్రపిండాల వ్యాధులున్న వారికి మొక్కజొన్న మంచి ఔషదం.

ఉల్లిపాయ: ఉల్లిపాయ శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయి.

అనాస పండ్లు: అనాసపళ్ళలో బ్రోమిలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. వాపుల్ని తగ్గిస్తుంది.

పుచ్చకాయపుచ్చకాయలో ఉండే లైకోపీన్.. గుండె, చర్మ సంబందిత వ్యాధుల నుంచి కాపాడుతుంది.

సపోటాపళ్ళు: సపోటాపళ్ళు మలబద్దకాన్ని నివారిస్తాయి.

దాల్చిన చెక్క: దాల్చిన చెక్కకు పంటి నొప్పిని తగ్గించే శక్తి ఉంది.

ఆవాలు: ఆవాలు అజీర్తిని తగ్గిస్తాయి.

చేపలు: చేపలు తింటే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

కమలాఫలాలు: కమలాఫలాలు న్యుమోనియాకు చక్కని మందు.

క్యారెట్లు: క్యారెట్లు నరాల బలహీనత నుండి కాపాడతాయి.

యాపిల్: యాపిల్ తింటే నిద్ర బాగా పడుతుందని పరిశోధనలో తేలింది.

వాము: వాము దంత వ్యాధులను తగ్గిస్తుంది.

పచ్చి జామకాయ: పచ్చి జామకాయలో ఉండే టానిస్ మాలిక్, ఆక్సాలిన్ ఆమ్లాలు నోటి దుర్వాసనను పోగోడుతాయి.

ఉలవలు: ఉలవలు ఊబకాయాన్ని తగ్గిస్తాయి.

ఖర్జూరం: ఖర్జూరం మూత్ర సంబంధిత వ్యాధుల్ని తగ్గించి, మూత్రం సాఫీగా అయ్యేలా చేస్తుంది.

ద్రాక్ష: ద్రాక్షలో ఉండే పైటోకెమికల్స్.. కొలెస్ట్రాల్ ని దరిచేరనివ్వవు.

జామపళ్ళు: జామపళ్ళు ఎక్కువగా తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

టొమాటో: ప్రోస్ట్రేట్ క్యాన్సర్ సోకకుండా అడ్డుకునే శక్తి టొమాటోలకు ఉంది.

నేరేడు పళ్ళు: నేరేడు పళ్ళు తింటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి.

బొప్పాయి: మొలల వ్యాధికి బొప్పాయి మంచి మందు.

మునగ కాయలు: మునగ కాయలు ఆకలిని పెంచుతాయి.


జొన్న ఇడ్లీలు


జొన్నలు లేదా జొన్నరవ్వ  మూడు కప్పులు తీసుకోవచ్చు. ఒక కప్పు మినప్పప్పు,

అరస్పూన్ మెంతులు వీటన్నిటిని కలిపి ఆరు గంటలు నానబెట్టాలి. ఆ తర్వాత

వీటన్నిటిని గ్రైండ్ చేసుకొని కనీసం 6 గంటల తర్వాత ఇడ్లీగా పెట్టుకున్నట్లైతే పిండి కాస్త

పులిసి ఇడ్లీలు వస్తాయి. కాస్త సోడా ఉప్పు కలిపితే ఇడ్లీలు మృదువుగా వస్తాయి. 

రోజూ ఇడ్లీలు దోశలు తినే వారికి ఇది ఒక మంచి ప్రత్యామ్నాయం.

ఇలాంటి చిరు ధాన్యాలతో  వంటకాలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకొనుటకు

ఈ క్రింద ఉన్న లింకు క్లిక్ చేయుట ద్వారా బుక్ డౌన్లోడ్ చేసుకోండి. 

మునగాకు పచ్చడి


మన చుట్టూ ఉన్న ఆకులు, కాయల్లోనే ఎన్నో మొండి వ్యాధులను నయం చేయగలిగిన లక్షణాలు

ఉన్నాయి. అంతేకాదు వాటిని మనం వంటల్లో భాగం చేసుకోవడం వల్ల కొన్ని వ్యాధులు ముప్పు

కూడా తప్పిపోతుంది. అన్ని కాలాల్లో దొరికే  మునగాకును ఆహారంలో భాగంగా చేసుకుంటే మనం

తరచూ ఎదుర్కొనే చిన్న చిన్న వ్యాధులను కాపాడుతుంది. ఇందులో విటమిన్-ఎ, క్యాల్షియం

అధికంగా ఉండడం వల్ల  వ్యాధులు రాకుండా చేస్తుంది. బరువు, లావు తగ్గాలనుకునే వారికి

మునగాకు బాగా ఉపయోగపడుతుంది. ఇందులోని విటమిన్-సి ఎముకలను బాగా బరపరుస్తుంది.

విటమిన్-ఎ,సి నే కాకుండా కాల్షియం, ఐరన్, ఫాస్పరస్ ఎక్కువగా ఉంటుంది. అలాగే యాంటీ

బాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ఆకులను పచ్చడి లేదా కూరచేసుకుని తింటే

జీర్ణ శక్తిని పెంచుతుంది. అలాగే మధుమేహం, రక్తపోటును అదుపులో ఉంచుతుంది. 

ఇన్ని ఔషధ గుణాలున్న మునగాకు పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాం.


ఒక పాన్ లో కొంచెం నూనె పోసి వేడిగా అయిన తరువాత అందులో ఆవాలు, జీలకర్ర,

ఎండుమిర్చి, కరివేపాకు, మెంతులు, వెల్లుల్లి, ధనియాలు, పచ్చిమిర్చి , ఇవన్నీ బాగా వేయించి

తీసి ఒక బౌల్‌లో పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత రెండు కప్పుల మునగాకుకు అదే పాన్ లో

కొంచెం నూనె వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించి పక్కనే పెట్టుకోవాలి. మిక్సీ జారులో

ముందు వేయించిన దినుసలన్నీ వేసి ,నానబెట్టిన చింతపండు మిక్సీ పట్టి ఆ తరువాత 

మునగాకు కూడా వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న పచ్చడిని గిన్నెలోకి తీసుకుని

పక్కన పెట్టుకోవాలి. మరొక పాన్ లో కొంచెం నూనె పోసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర,

కరివేపాకు, ఎండుమిర్చి వేసి తాళింపు పెట్టి రుబ్బుకున్న పచ్చడి అందులో వేసి కలిపి

దించేయాలి. ఇలా చేసిన పచ్చడిని తింటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

 కరివేపాకు సూప్ 

(కరివేపాకు తో వెయిట్ లాస్ మరియు సంపూర్ణ ఆరోగ్యం పొందే ఒక రిసీపీ)

కరివేపాకులో పలు రకాల ఔషధ గుణాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నందున ఇది

'ఆయుర్వేద నిధి'  గా పరిగణించబడుతుంది.


కరివేపాకు సూప్ తయారుచేసుకోవడం చాలా సులువు. ఒక పాన్‌లో ఒక కప్పు నీటిని మరిగించాలి.

గ్యాస్ ఆఫ్ చేసి, ఆ నీటిలో కరివేపాకు ఆకులను వేయాలి. కాసింత మిరియాలు, దాల్చిన చెక్క,

లవంగం వేసి, ఆ సూప్ కలర్ మారే వరకు ఉంచి, ఆపై కరివేపాకు ఆకులను తీసేయాలి.

అనంతరం ఆ సూప్ తాగాలి. 

కరివేపాకు సూప్ వల్ల కలిగే ప్రయోజనాలు  ఏంటో చూద్దాం.

బరువు తగ్గడానికి: 

కరివేపాకు సూప్ బరువు తగ్గించే పానీయంగా ఉపయోగించవచ్చు. దీని వినియోగం ఊబకాయాన్ని

తగ్గించడమే కాకుండా కొలెస్ట్రాల్‌ను త్వరగా తగ్గించడంలో సహాయపడుతుంది. వాడిన ఒక వారం 

రోజుల నుంచే తేడా గమనించవచ్చు.


మెరుగైన జీర్ణక్రియ: 

జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా కరివేపాకు, కరివేపాకు సూప్ను

తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో లాక్సిటివ్‌లు ఉంటాయి. దీని వల్ల గ్యాస్, మలబద్ధకం,

విరేచనాలు వంటి సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు.


శరీర నిర్విషీకరణ 

కరివేపాకు నీటిని తాగడం వల్ల శరీరం నుంచి విష మలిణా లు తొలగిపోతాయి. వాస్తవానికి ఈ

ఆకులలో ఉండే యాంటీ-ఆక్సిడెంట్లు శరీర నిర్విషీకరణకు సహాయపడతాయి. చర్మ ఇన్ఫెక్షన్లు,

చర్మ సమస్యలు మరియు ఫ్రీ రాడికల్స్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.


మానసిక ఒత్తిడి దూరం: 

ప్రస్తుత కాలంలో చాలా మంది మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. పనిభారం, డబ్బు,

అనారోగ్యం మొదలైన కారణాలతో మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. కరివేపాకు సూప్ తాగితే

టెన్షన్‌ని తగ్గించడంలో సహాయపడుతుంది.


గమనిక: 

కరివేపాకు కాషాయమే తీసుకోవాలని ఏం లేదు, ఒక పిటికెడు కరివేపాకును ప్రతిరోజు బ్రేక్ ఫాస్ట్

పాటు తీసుకోవడం ద్వారా పైన చెప్పిన లాభాలు అన్నీ కూడా కలుగుతాయి. అయితే బాగా నమిలి

తినాలి.